అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రంలో ప్రతీ సాంగ్ సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు టిక్ టాక్లలోనో లేదంటే ఈవెంట్స్లోనో ఈ చిత్రంలోని సాంగ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాదు చుట్టు పక్కరాష్ట్రాల ప్రజలు కూడా అల వైకుంఠపురములోని సాంగ్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి, ఆమె సోదరి షమితా శెట్టి టిక్ టాక్లో బుట్టబొమ్మ సాంగ్కి స్టెప్పులేసి నెటిజన్స్ని అలరించారు. ఇప్పుడు ఈ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. శిల్పా శెట్టి తెలుగులో పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ఓ పక్క సీక్వెల్, మరో పక్క రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. ‘కబీర్ సింగ్’ నిర్మాత అశ్విన్ వార్దే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నుంచి ఎనిమిది కోట్లు రూపాయలు పెట్టి రీమేక్ రైట్స్ దక్కించుకున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం విదితమే.