ఆయేషా హంతకులు రోజాకు తెలుసు

ఆయేషా హంతకులు రోజాకు తెలుసు

తెనాలి: తన కూతురిని చంపిందెవరో వైకాపా శాసనసభ్యులు రోజాకు తెలుసని 2007లో దారుణ హత్యకు గురైన ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం శనివారం ఇక్కడ తెలిపారు. ‘నా కూతురు హత్యకు గురైన తర్వాత రోజా ఎంతో హడావుడి చేసారు. నేర గా ళ్లు ఎవరో ఆమెకు తెలుసు. వారి గురించి శాసన సభలో రోజా ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మౌనంగా ఉన్నా ర’ని ప్రశ్నించారు.‘ నాయకులకు, డబ్బున్న వారికే చట్టాలు చుట్టాలు. మధ్య తరగతి కుటుంబాలు, పేదలకు ఎప్పుడూ న్యా యం జరగదు. నేరగాళ్ల గురించి గతంలో నేను ఒకసారి మాట్లాడితే రూ.కోటికి పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిం చారు. మా వద్ద కోటి పైసలూ లేవు. ఎలాంటి దావా అయినా వేసుకోవచ్చు. విచారణలో నిజాలు వెలుగు చూసినపుడే ఎవరు రూ.కోటి చెల్లించాలో, ఎవరు శిక్ష అనుభవించాలో తెలుస్తుంది. న్యాయం కోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. మన దేశంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయింది. 21 రోజుల్లో నిందితులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ఈ కే సు ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆయేషా చట్టాన్ని కూడా తీసుకురావాల’న్నారు. ఆయేషా మీరా మృత దేహాన్ని కాసే ప ట్లో  మళ్లీ పరీక్షించనున్నారు. ఇందుకోసం తెనాలి చెంచుపేట స్మశానవాటికకు సీబీఐ అధికారులు చేరుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos