ముంబై: మార్కెట్లు బుధవారం నష్టాలతోనే మొదలయ్యాయి. ఉదయం 9.51 గంటల వేళకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 298 పాయింట్లు కూలి 38,798 వద్ద ఆగింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 85 పాయింట్లు పతనమై 11,503 వద్ద ట్రేడ్ అయ్యింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.70 వద్ద దాకలైంది. చమురు ధరలు రెండు శాతం మేర పడి పోయాయి. పవర్ గ్రిడ్, టైటాన్, ఎన్టీపీసీ, టీసీఎస్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు లాభాల్ని పొందాయి. టాటా మోటార్స్, ఎస్బీఐ, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్స్ నష్ట పోయాయి. సమాచార సాంకేతిక రంగమే లాభాల్ని గడిస్తున్నాయి. తక్కినవన్నింటీక నష్టాలే.