నష్టాల పాలైన విపణి

నష్టాల పాలైన విపణి

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల పాలయ్యాయి. సెన్సెక్స్ 155 పాయింట్లు నష్టపోయి 38,667కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 11,474 వద్ద ఆగింది. సెన్సెక్స్ ఒకదశలో 421 పాయింట్లు పతనమైంది. ఆఖర్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో నష్టాలు తగ్గాయి. బీఎస్ఈలో భారతి ఎయిర్ టెల్ (5.29%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.29%), ఇన్ఫోసిస్ (2.93%), ఐటీసీ ( 2.69%), టీసీఎస్ (2.06%) లబ్ధి పొందాయి. యస్ బ్యాంక్ (-15.06%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-6.84%), ఎస్బీఐ (-3.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.51%), సన్ ఫార్మా (-3.02%) నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos