70 శాతం మంది జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు..

70 శాతం మంది జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా 70 శాతం మంది ప్రజలు తప్పుపట్టారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి జాతీయ మీడియా అయిన ఇండియా టీవీ సర్వేను ట్విట్టర్ వేదికగా నిర్వహించింది.కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసనపరమైన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయబోన్నారనిరాజధానులను విభజించడం సరైన ఆలోచనేనా? అంటూ పోల్ నిర్వహించింది. పోల్ లో 67 శాతం మంది ప్రజలు మూడు రాజధానుల ఆలోచన సరైనది కాదంటూ జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. 29 శాతం మంది సరైన నిర్ణయమేనని అభిప్రాయపడ్డారు. 4 శాతం మంది ఏమీ చెప్పలేమని అన్నారు. పోల్ సర్వేను ఇండియా టీవీ దాదాపు 5 గంటల సేపు నిర్వహించింది. దాదాపు 8 వేల మంది పోల్ లో పాల్గొన్నారు.మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర శాసనసభ నిన్న ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే

తాజా సమాచారం

Latest Posts

Featured Videos