ఆగస్ట్‌ 14 నుండి రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశాలు

ఆగస్ట్‌ 14 నుండి రాజస్థాన్‌  అసెంబ్లీ సమావేశాలు

జైపూర్: శాసనస సభ సమావేశాల్ని వచ్చే నెల 14 నుంచి నిర్వహించేందుకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా గురువారం అనుమతించారు. వెంటనే సభ సమావేశ పరచేందుకు గతంలో ప్రభుత్వం చేసిన మూడు వినతుల్ని తిరస్కరించారు. నియమావళి ప్రకారం ఆగస్ట్ 14 నుంచి సభ ఐదో సమావేశాన్ని ప్రారంభించేందుకు గవర్నర్ అనుమతించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 21 రోజుల ముందు సూచన లేకుండా సమావేశాల్ని నిర్వహించరాదనేది నియమావళి అని న్యాయ, సభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి కుమార్ ధరివాల్ తెలిపారు. కరోనా విజృంభిస్తున్నందున అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని స్వల్ప కాలిక సమావేశాన్ని నిర్వహించేందుకు గవర్నర్ అనుమతించారన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos