సిరీస్ గెలుస్తారా…

  • In Sports
  • March 12, 2019
  • 158 Views
సిరీస్ గెలుస్తారా…

దిల్లీ : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభమై, తొలి రెండు వన్డేలను గెలుచుకున్న భారత్, సిరీస్‌ను అలవోకగా సొంతం చేసుకుంటుందని అందరూ భావించారు. అయితే మూడు, నాలుగు వన్డేల్లో ఆసీస్ అనూహ్యంగా పుంజుకుని, విజయ పతాకను ఎగురవేసింది. దీంతో బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే చివరి వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీ20 సిరీస్‌ లాగా వన్డే సిరీస్‌నూ భారత్ కోల్పోతుందా లేక నిలబెట్టుకుంటుందా…అనేది ప్రస్తుతం అభిమానుల మదిని తొలిచివేస్తోంది. మూడో వన్డేలో పిచ్, వాతావరణ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, నాలుగో వన్డేలో దారుణమైన ఫీల్డింగ్, వివాదాస్పదమైన డీఆర్ఎస్…భారత్ జట్టును ఓడిపోయేలా చేశాయి. కనుక అయిదో వన్డేకు జట్టు కట్టుదిట్టమైన ప్రణాళికతో మైదానంలోకి దిగాల్సి ఉంది. దీనికి తోడు ప్రపంచ కప్పునకు ముందు ఇదే ఆఖరి వన్డే కనుక అనేక మంది ఆటగాళ్లకు ఇదో రకమైన పరీక్షే. మొహాలి వన్డే ఆడిన జట్టు నుంచి ఒకటి, రెండు మార్పులు చేసే అవకాశాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos