హైదరాబాద్: తెలంగాణ పాత సచివాయం నేలకొరిగింది. భవనం కూల్చివేత పనులు పూర్తి అయినట్లు సమాచారం. తెలంగాణ సెక్రటేరియట్ అనేది ఒక చరిత్ర.. తెలంగాణ సచివాలయ భవనాలు నేలమట్టమయ్యాయి. సామాన్యుల నుంచి సచివుల వరకూ నిత్యం జనంతో కళకళలాడిన ప్రాంగణం.. ఇప్పుడు ఎటు చూసినా శిథిలాల గుట్టలు, కూలిన గోడలతో కనిపిస్తోంది. నూతన సచివాలయ భవనాన్ని సకల హంగులతో, ఆధునిక పోకడలతో, ఆకర్షణీయంగా, సర్వాంగ సుందరంగా నిర్మించనున్నారు. సీఎం కేసీఆర్ ఆశించినట్లుగా పూర్తి వాస్తు కౌశలంతో సమీకృత సచివాలయ భవనం అందుబాటులోకి రానుంది.