అమరావతి:ఇక్కడి సచివాలయంలో శుక్రవారం బాధ్యతల స్వీకరణను ముఖ్యమంత్రి జగన్ చివరి నిముషంలో వాయిదా వేసుకున్నారు. తన నివాసం నుంచే విధుల్ని నిర్వర్తిస్తున్నారు. శుభ ముహూర్తంలో సచివాలయంలో బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకోవటమే కారణం. జగన్తో పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ భేటీ, పలువురు ఉన్నతాధికారులు సమావేశమై ఆర్థిక పరిస్థితి, ఆయా శాఖల స్థితి గతుల్ని జగన్ సమీక్షించారు.