అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించదలచిన వీడియో సమావేశం రెండో రోజూ రద్దయ్యింది. సమావేశం నిర్వహణకు ఎన్నికల కమిషనరు రమేశ్ కుమార్ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖకు స్పందన కరువు కావటం ఇందుకు కారణం. దీన్నిఎన్నికల కమిషనర్ న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేనందున సమావేశం అవసరం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఇది వరకే నిమ్మగడ్డకు ప్రత్యుత్తరం పంపారు. కోర్టుల్లో స్థానిక ఎన్నికల వ్యాజ్యాలు విచారణకు వచ్చినపుడు ఈ విషయాన్ని ప్రస్తావించదలచారు.