వారణాసి: లాక్డౌన్లో ప్రధాని మోదీ దత్తత గ్రామం దొమారిలో పేదల దారుణ పరిస్థితిని కళ్లకు కట్టిన పాత్రికీయురాలు సుప్రియ శర్మపై పోలీసులు కేసు దాఖలు చేసారు. ‘లాక్డౌన్లో అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నార’ని తన కథనంలో రాసారు. ఇదంతా అబద్ధమని స్థానిక మమహిళ చేసిన ఫిర్యాదు ప్రకారం ఆ కనాన్ని రాసిన స్క్రోల్ ఇన్ కార్యనిర్వహక సంపాద కురాలు సుప్రియ శర్మ, ప్రధాన సంపాదకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ‘ఈ చర్య జర్నలిస్టుల స్వేచ్ఛను కాలరాయడమే.కరోనా కష్ట కాలంలోనూ పని చేస్తున్న పాత్రికేయులను బెదిరించడమేన’ని స్క్రోల్ ఇన్ మండిపడింది. దొమారి గ్రామాన్ని “సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన” కింద మోదీ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.