మంత్రి వర్గ సమావేశానికి అజెండా ఖరారు

మంత్రి వర్గ సమావేశానికి అజెండా ఖరారు

అమరావతి : రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అధ్యక్షతన గురువారం జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన అజెండాలోని అంశాలన్నిటినీ యథాతథంగా ఉంచింది. ఈ అజెండాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని నిర్ణయించింది. అజెండాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, ఉపాధి పరిస్థితులు, తాగు నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఫొని నష్టం-అంచనాలు లాంటి నాలుగు కీలకాంశాలు ఉన్నాయి. ఈ నెల 14న మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos