సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఆరు మంది గల్లంతు..

సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఆరు మంది గల్లంతు..

కారు అదుపు తప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో ఆరు మంది గల్లంతైన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఈసీఐఎల్‌లోని అంకుర ఆసుపత్రిలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన అబ్దుల్ ,రాజేష్,జాన్సన్ ,సంతోష్ కుమార్,నరేష్,పవన్ కుమార్ అదే ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ విమలకొండ మహేష్ కుమార్ వివాహానికి హాజరై వస్తుండగా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామం సమీపానికి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సాగర్ కాలువ ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రక్షణ సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతయిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వీరు ఆ ప్రవాహానికి కొట్టుకుపోయి ఉంటారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos