అమరావతి:దేవుళ్లకు బదులుగా కరోనా నుంచి కాపాడే శాస్త్రవేత్తలకు మొక్కండని సినీనటుడు, జనసేన నేత నాగబాబు గురువారం ట్వీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.’మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని ఇంకా కొట్టుకొని చావకండి.దేవుళ్లు, స్వామిజీలు, దేవుడి ప్రతినిధులు ఏమీ చేయలేక గుళ్లు ప్రార్థన మందిరాలు ఇంకా అన్ని మూసుకొని కూర్చుని శాస్త్రవేత్తలు, డాక్టర్స్ ఏ మందు కనిపెట్టి మనలని కాపా డతారా? అని ఎదురు చూస్తున్నారు. వెళ్లి సైంటిస్టులకి మొక్కుదాం. ఈ కరోనా బారినుంచి మనల్ని కాపాడేది వాళ్లే’ అని వ్యాఖ్యానించారు.