స్కూల్ యూనిఫాం ధరించినవారికి పార్కుల్లో నో ఎంట్రీ

స్కూల్ యూనిఫాం ధరించినవారికి పార్కుల్లో నో ఎంట్రీ

లఖ్నవూ : పాఠశాలల పని వేళల్లో స్కూలు యూనిఫాం ధరించిన విద్యార్థినీ, విద్యార్థులను ఉద్యానవనాలు మాల్స్, రెస్టారెంట్లు, జంతు ప్రదర్శన శాలలు వంటి బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించరాదని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థినీ, విద్యార్థులకు వర్తిస్తాయని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డాక్టర్ సుచిత చౌదరి చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులు తరగతులకు హాజరవడానికి బదులు ఇటువంటి ప్రదేశాల్లో గడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి సందర్భాల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos