చక్రవడ్డీ పై కేంద్రానికి తాఖీదులు

చక్రవడ్డీ పై కేంద్రానికి తాఖీదులు

న్యూ ఢిల్లీ : మారటోరియం వ్యవధి ఈఎంఐల పై వడ్డీ విధింపు గురించి బదులివ్వాలని అత్యున్నత న్యాయస్ధానం గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం ఆర్బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ రద్దుతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని, మదుపర్ల ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని న్యాయస్థానానికి సమర్పించిన ప్రమాణ పత్రంలో ఆర్బీఐ పేర్కొంది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ రద్దు, చక్ర వడ్డీ విధించకపోవటాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ‘ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఇది తీవ్రంగా చర్చించాల్సిన అంశం. ఒక వైపు మారటోరియం వెసులుబాటు ఇస్తూనే మరో వైపు పేరుకుపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తున్నార’ని జస్టిస్ అశోక్ భూషణ్, సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు సాగాయి. మహమ్మారి వైరస్తో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలకు మారటోరియం వెసులుబాటు ఇచ్చినా వడ్డీ భారం మోపడం సరైంది కాదని కక్షిదారు గజేంద్ర శర్మ వాపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos