‘దేశద్రోహ చట్టంపై నిర్ణయం తీసుకుంటారా? లేదా?’

న్యూ ఢిల్లీ : దేశ ద్రోహ చట్టం 124ఏ రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల కేంద్రానికి జారీ చేసిన నోటీసులపై సమాధానం ఇవ్వ డానికి సొలిసిటర్ జనరల్(ఎస్జీ) తుషార్ మెహతా సమయం కోరారు. వ్యాజ్యాలన్నింటినీ ఒకే ధర్మాసనం ముందుకు తెచ్చినా కేంద్రం స్పందించలేదని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయవాదుల స్థాయిలో సిద్ధమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీంతో ఏం నిర్ణయం తీసుకున్నారు? అసలు నిర్ణయం తీసుకుంటారా? లేదా? అని ప్రశ్నించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయాన్ని కోరింది. ‘దేశ ద్రోహ చట్టం దుర్వినియోగం వ్యవహారంలో సుప్రీం కోర్టు మార్గ దర్శకాలు రూపొందించింది. ఇప్పుడు హనుమాన్ చాలీసా చదివినందుకు కూడా దేశ ద్రోహం కేసు నమోదు చేస్తున్నారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.”అని ధర్మాసనం పేర్కొంది. దేశద్రోహం వ్యవహారంలో కేదార్నాథ్ తీర్పుతో సంబంధం లేకుండా వాదనలు కొనసాగించవచ్చని సీని యర్ న్యాయవాది కపిల్ సిబల్ చెప్పారు. ‘వలసవాదులు వెళ్లిపోయారు.. ప్రస్తుతం మనల్ని మనమే పాలించుకుంటున్నామన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచు కోవా లని’ సిబల్ అన్నారు. మరో పెద్ద ధర్మాసనానికి వ్యాజ్యాల్ని బదిలీ చేయాలో వద్దో.. కేదార్నాథ్ కేసుతో సంబంధం లేకుండానే లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కక్షి దార్లను, ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. వచ్చే మంగళవారం మధ్యాహ్నం 2గం.ల నుంచి విచారణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. తదుపరి వాయిదాలు కుదరదని స్పష్టం చేశారు. సోమవారం ఉదయంలోగా ఇద్దరూ తమ సమాధానాలు దాఖలు చేయాల్సిందేనని ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos