ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్.. ఎస్‌బిఐకి నోటీసులు..

ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్.. ఎస్‌బిఐకి నోటీసులు..

న్యూ ఢిల్లీ: : ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులో ఎస్బిఐ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఆదేశాలు పాటించలేదంటూ ఎస్బిఐకి నోటీసులు జారీచేసిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం. ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్బిఐ.. ఆ బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్స్ నెంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికిచ్చారన్న విషయం తెలియడం లేదని రాజ్యాంగ ధర్మాసనం ఫైర్ అయ్యింది. అన్ని వివరాలను వెల్లడించాలని గతంలో ఇచ్చిన తీర్పులో వెల్లడించినా.. ఎస్బిఐ పట్టించుకోకపోవడంతో సీజేఐ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. అప్పటిలోగా ఎస్బిఐ వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos