న్యూఢిల్లీ: భాజపా అసంతృప్తి నేత, మాజీ సినీ నటుడు శత్రుఘ్నుసిన్హాను నాయకత్వంలో ఎన్నికల బరి నుంచి తప్పించింది. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పాట్నా సాహిబ్ నియోజకవర్గం అభ్యర్థిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ను ప్రకటించింది. నాయకత్వం గత కొంత కాలంగా శత్రుఘ్నుసిన్హాను పార్టీ కార్య కలాపాలున, దూరం చేసింది. దరిమిలా ఆయన అసంతృప్తి చెంది నాయకత్వ విధానాల్ని విమర్శిస్తూ వచ్చారు. ఫలితంగా ఆయనకు నాయకత్వం ఎన్నికల్లో పోటీకి అవకాశాన్ని ఇవ్వకుండా మొండి చేయి చూపింది.