న్యూఢిల్లీ: విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సమితి సభ్యత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థూరూర్ నిరాకరించారు. గత లోక్సభలో ఆయన ఇదే సమితికి నాయకత్వాన్ని వహించారు. తానే నాయకత్వం వహించిన సమితిలో కేవలం సభ్యుడిగా ఉండటం తనకు ఇష్టం లేదన్నారు. సమాచార సాంకేతిక విజ్ఞాన పార్లమెంటరీ స్థాయీ సమితికి నాయకత్వాన్ని వహిస్తున్నందుకు తన చేతి నిండా పని ఉందనీ వివరించారు.తనను విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సమితి నాయకుడుగా నియమించనందుకు శశి థరూర్ విమర్శించారు. విపక్ష సభ్యుడికి సమితి నాయకత్వం అప్పగించే సంప్రదాయానికి మోదీ ప్రభుత్వం మంగళం పాడిందని వ్యాఖ్యానించారు.