ముంబై: మహారాష్ట్ర సహకార బ్యాంక్ అవినీతి కేసుకు సంబంధించి వచ్చే శుక్రవారం ఈడీ విచారణకు హాజరు కానున్నట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవా ర్ బుధవారం ఇక్కడ తెలిపారు. బ్యాంకు రూ. 25 వేల కోట్ల పెట్టుబడుల వ్యవహారంలో శరద్ పవార్ హస్తం ఉందని ఈడీ ఆరోపణ. ‘శుక్రవారం మధ్యా హ్నం 2 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్తాను. ఎవరూ తనను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేనే వెళ్తాను. ఈ కేసుకు సంబంధించి నా వద్ద ఉన్న సమాచారాన్నంతా తెలియజేస్తా. నేను ఏ బ్యాంకు లావాదేవీల్లో పాలుపంచు కోలేదు. నాకు భారత రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉంద’ని చెప్పారు. ‘నన్ను జైలుకు పంపినా బాధపడబోను. ఇప్పటి వరకు జైలు జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. జైలుకు పంపితే ఎంజాయ్ చేస్తా న’ని మంగళవారం ఇక్కడ అనటం తెలిసిందే.