మోదీని విమ‌ర్శిస్తే నేరుగా జైలుకు పంపుతున్నారు

మోదీని విమ‌ర్శిస్తే నేరుగా జైలుకు పంపుతున్నారు

బారామతి: తాను గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి ఎలాంటి వివక్ష ప్రదర్శించకుండా సాయం చేశానని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. అయితే ప్రధాని మోదీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బారామతిలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి పవార్ ప్రసంగించారు. ఇప్పుడు ఎవరైనా ప్రధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్యలు చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్ సీఎం ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనను జైలుకు పంపారని అన్నారు.ప్రధానికి వ్యతిరేకంగా ప్రకటన చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సైతం జైలు పాలు చేశారని గుర్తుచేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదు..నియంతృత్వమని పవార్ పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారాలన్నీ మోదీ చేతిలో కేంద్రీకృతమయ్యాయని, మనం వాటిని ఆయన నుంచి విడిపించుకోవాల్సి ఉందని పిలుపు ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos