సర్పంచి స్థానాలకు 1,609, వార్డు సభ్యులకు 5,223

సర్పంచి స్థానాలకు 1,609, వార్డు సభ్యులకు 5,223

సిద్దిపేట: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో తొలివిడత నామపత్రాల దాఖలు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. చివరి రోజు సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు భారీ సంఖ్యలో నామపత్రాలు దాఖలు అయ్యాయి. ఈనెల 7న ప్రారంభమయిన ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఎంపీడీవో కార్యాలయాలకు సాయంత్రం 5 గంటల లోపు చేరుకున్న అభ్యర్థులందరికీ టోకెన్లు జారీ చేసి రాత్రి వరకు నామపత్రాలు స్వీకరించారు. జిల్లాలో తొలివిడత ఎన్నికలు సిద్దిపేట డివిజన్‌లో దౌల్తాబాద్‌ మండలం మినహాయించి మిగిలిన తొమ్మిది మండలాల్లో 186 గ్రామ పంచాయతీలు, 1712 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో కలిసి 9 మండలాల్లో సర్పంచి స్థానాలకు 1,609, వార్డు సభ్యులకు 5,223 నామపత్రాలు దాఖలయ్యాయి. చివరి రోజు బుధవారం సర్పంచి పదవులకు 948, వార్డు సభ్యుల స్థానాలకు 3,502 నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయి. చివరి రోజు భారీ సంఖ్యలో నామపత్రాలు దాఖలు కావడం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos