మరో ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు

న్యూ ఢిల్లీ : రాజ్యసభ లో బుధవారం మరో విపక్ష సభ్యుడు- ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన సంజయ్ సింగ్ ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వారాంతం వరకూ సస్పెండ్ చేశారు. సంజయ్ సింగ్ మంగళవారం నిబంధనలకు విరుద్ధంగా సభలో పేపర్లు చింపి సభాపతిపై విసిరినందుకు ఈ చర్య తీససుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్లో కల్తీమద్యం-మరణాల గురించి మంగళవారం సాయంత్రం సభలో ప్రస్తావించారు. 40 మంది మృతికి కారణం ఏంటో చెప్పాలంటూ సభలో పెద్దఎత్తున నినాదాలు చేశారు. కొన్నికాగితాల్ని చింపి చైర్మన్పై విసిరారని చైర్మన్ పేర్కొన్నారు. సభాలోనే ఉండి గుజరాత్లో కల్తీ మద్యానికి మరణాలపై కారణాలను డిమాండ్ చేస్తానని ఆయన చెప్పారు. ‘‘ మోడీ గారు నన్ను సస్పెండ్ చేసినా పోరాడుతూనే ఉంటా. గుజరాత్లో కల్తీ మద్యం మరణాలకు కారణం అడుగుతూనే ఉంటా. ఇప్పుడు నేను సభలోనే ఉన్నా’’ అని హిందీ లో ట్వీట్ చేశారు. సస్పెన్షన్ కు గురయిన మొత్తం 20 మంది రాజ్యసభ సభ్యులు 50 గంటలపాటు పార్లమెంట్ ఆవరణలో రిలే నిరసన తెలపనున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ నేత దోలా సెన్ చెప్పారు. ధరల పెరుగుదలపై గళమెత్తిన ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సస్పెన్షన్ ఎత్తివేయాలని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లను కోరుతూ విజ్ఞాపన పత్రాల్ని అందిస్తామన్నారు. ఎంపీల సస్పెన్షన్పై విసక్షాలు బుధవారం సమావేశమై సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. ‘‘ ద్రవ్యోల్బణం, నిత్యావసరాలపై జీఎస్టీ అంశాలపై చర్చించాలని గత 7 రోజుల నుంచి కోరుతున్నాం. సామాన్యులు ఆందోళన చెందుతున్న ఈ అంశాలపైనే ఈ రోజు కూడా మా గొంతువినిపిస్తాం. నిరంతరాయంగా మా వాణిని వినిపిస్తాం. కానీ ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై చర్చించేం దుకు సిద్ధంగా లేదు. ఈ అంశంపై ఈ రోజు చైర్మన్ను వ్యక్తిగతంగా కలుస్తాను. చర్చ తేదీ, సమయం చెప్పాలని అడుగుతా. మేము చర్చకు సిద్ధం. స్పీకర్, రాజ్యసభ చైర్మ న్కు ఈ మేరకు లేఖ అందజేస్తాం. ధరల పెరుగుదలకు వ్యవరేతికంగా మాట్లాడుతాం. కానీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదు’’ అని చెప్పారు.

తాజా సమాచారం