న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఇవాళ ఆప్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. జైలు నుంచి ప్రత్యేక పోలీసు వాహనంలో ఆయన సివిల్ లైన్స్లో ఉన్న ఆఫీసుకు వచ్చారు. జైలు నుంచి పోలీసు వాహనంలో వచ్చిన ఎంపీ సంజయ్ సింగ్ వీడియోను ఆప్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో పోస్టు చేసింది. ఆ వీడియోకు సాంగ్ను కూడా జోడించింది.రాజ్యసభ రీనామినేషన్ కోసం ఎంపీ సంజయ్ సింగ్ రిటర్నింగ్ ఆఫీసుకు వెళ్లేందుకు శనివారం ఢిల్లీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు.