iహంతకుల్ని ఉరి తీయాలి

iహంతకుల్ని ఉరి తీయాలి

హైదరాబాద్: తన భార్తను హత్య చేసిన వారిని ఉరితీయాలని హతుడు నీరజ్ భార్య సంజన డిమాండ్ చేశారు. బేగంబజారులో నీరజ్ పన్వార్ (21) ను శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో నలుగురు దుండగులు హత్య చేసారు. తాతతో కలిసి నీరజ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి కత్తులతో ఇరవై మార్లు పొడిచి చంపారు. మార్వాడి కులానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నందుకే యువతి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ‘వివాహం అయినప్పటి నుంచీ వారి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. నా కజిన్ విజయ్, సంజులు మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి తెగబడ్డారు. వారి నుంచి నాకు, అత్త, మామలకు కూడా ప్రాణహాని ఉంది. నీరజ్తో పెళ్లి అయినప్పటి నుంచి వారితో సంబంధాలు లేవు. నేను వివాహం చేసుకున్న తర్వాత నా బిడ్డ చనిపోయింది అని నన్ను వదిలేశారు. కానీ వాళ్లు ఇప్పుడిలా చేయడం వల్ల నాకు అన్యాయం జరిగింది’ అని సంజన వాపోయింది.  నీరజ్ పన్వార్ హత్యను నిరసిస్తూ బేగంబజార్ వ్యాపారులు మార్కెట్ బంద్ పాటించారు.  నీరజ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారవేత్తలందరూ ఈ హత్యను ఖండిస్తున్నామని, ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షిం చాలని కోరారు.  పోలీసులు వేగంగా స్పందించిన నిందితులను అరెస్ట్ చేయడంపై కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారులు వారికి త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని చెబుతున్నారు. తన కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ పన్వార్ తండ్రి జగదీష్ ప్రసాద్ పన్వార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం , కమిషనర్ ఆఫ్ పోలీస్ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos