హోసూరు : హోసూరు యూనియన్లోని అన్ని గ్రామాలలో కరోనా నిరోధక చర్యలు జోరుగా సాగుతున్నాయి. ఇచ్చంగురు పంచాయతీలో కరోనా నిరోధక చర్యలను ముమ్మరం చేశారు. గ్రామాలలో హోసూరు యూనియన్ చైర్పర్సన్ శశి వెంకటస్వామి నేతృత్వంలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేశారు. అనంతరం మురికి కాల్వలను శుభ్రం చేయించారు. హోసూరు ప్రాంతంలో కరోనా ప్రబలుతున్నందున, నిరోధక చర్యలలో భాగంగా యూనియన్లోని అన్ని గ్రామాలలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయనున్నట్లు చైర్పర్సన్ శశి వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఇచ్చంగురు పంచాయతీ అధ్యక్షుడు పద్మావతి చంద్రశేఖర్, బీడీవో కార్యాలయ సిబ్బంది ఆమె వెంట ఉన్నారు.