ముంబై: దేశ వ్యాప్తంగా చాలా చోట్ల గ్రామాలను వరదలు ముంచెత్తు తున్నాయి. వరదల వల్ల జన జీవనం అస్తవ్యస్తమైంది. మహారాష్ట్రలోని సాంగ్లి పట్టణంలో పడవ బోల్తా పడి తొమ్మిది మంది మృతి చెందారు. వరద సహాయక చర్యల్లో భాగంగా 30 మందితో వెళ్తున్న పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, 16 మందిని సహాయ సిబ్బంది కాపాడారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు.