ముస్లింలకు చోటెక్కడ?

ముస్లింలకు చోటెక్కడ?

శ్రీనగర్: భారత్ లో ముస్లింలకు చోటెక్కడుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె సనా ఇల్తిజా జావెద్ అసంతృప్తి చెందారు. పౌరసత్వ సవరణ ముసాయిదాను వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. దరిమిలా సనా తన తల్లి ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ‘ముస్లింలపై వివక్ష చూపేందుకు భాజపా ప్రభుత్వం ఈ చట్టానిన చేస్తోంది. దేశం లో ముస్లింలకు చోటు లేకుండా పోతోంది. వారిని రెండో తరగతి ప్రజలుగా చూపేందుకు కుట్రలు జరుగుతున్నాయ’ని ఆక్రోశిం చారు.

తాజా సమాచారం