దారిద్య్ర భారతం కనిపించ లేదా?

దారిద్య్ర భారతం కనిపించ లేదా?

ముంబై: స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా మోదీ ఉద్యోగాల కల్పన, కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై మాట్లాడి ఉంటే బాగుండేదని శివసేన పత్రిక – సామ్నా పేర్కొంది. ‘గంటన్నర పాటు ప్రసంగించిన మోదీ కరోనా టీకా ప్రయోగాలు, , భారత రక్షణ సామర్థ్యం, జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకం, వంటి పలు అంశాలపై అనర్గళంగా మట్లాడారు. కరోనా వల్ల కలిగే ఆర్థిక సంక్షోభం గురించి ఆత్మనిర్భర్ భారత్ పథకంను తొలగించగలదా?’ ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు? దేశంలో ఇప్పటివరకు దాదాపు 14 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. భవిష్యత్లో ఈ సంఖ్య పెరగవచ్చు. ఫలితంగా ప్రజలు వీధిన పడతారు. ఇప్పటికే మహమ్మారి కారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిపై ప్రధాని మాట్లాడాల్సింది.దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి మాతృభూమిని కాపాడటానికి సైనిక, వైమానిక దళాలున్నాయి. అంతర్గతంగా రక్కసిలా విరుచుకుపడుతున్న ఆకలి, నిరుద్యోగం వంటి సమస్యలతో మనం ఎలా పోరాడగలం?’అని నిలదీసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారత్ వేగవంతం చేయగలదని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలనూ ఎద్దేవా చేసింది. ‘ప్రపంచాన్ని వదిలేయండి సార్. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధ రించండి. స్వాతంత్ర్య వేడుకలు వస్తుంటాయ్, పోతుంటాయ్. సమస్యలు మాత్రం యథాతథంగా ఉంటాయ’ని వ్యాఖ్యానించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos