ముంబై: ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని శివసేన ప్రశంసలతో ముంచెత్తింది. ప్రత్యర్థిని ఇటీవలి ఎన్నికల్లో భారీగా ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్ని గురువారం సామ్నా పత్రిక సంపాదకీయం ‘విజయ వీరుడు’ గా అభివర్ణించింది.