సంఝౌతా కు పాక్‌ ఎర్ర్ర జెండా

సంఝౌతా కు పాక్‌ ఎర్ర్ర జెండా

ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేయటంతో భారత్తో వాణిజ్య సంబంధాలను దాదాపుగా రద్దు చేసుకున్న పాకిస్తాన్ తాజాగా రెండు దేశాల మధ్య తిరిగే సాగించే సంఝౌతా ఎక్స్ప్రెస్ను శాశ్వతంగా నిలిపివేసింది. దీంతో అటారి సరిహద్దులోని అంతర్జాతీయ రైల్వేస్టేషన్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకు పోయారు. సంఝౌతా ఎక్స్ప్రెస్ను శాశ్వతంగా నిలిపివేసినట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు. ఇప్పటికే టిక్కెట్లు కొన్న వ్యక్తులు తమ డబ్బును లాహోర్ డిఎస్ కార్యాలయం నుంచి వాపస్ పొందవచ్చ న్నారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్య తీసుకున్నామని వివరించారు. పాక్తో భారతీయ చిత్రాల ప్రదర్శనను కూడా నిలిపివేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ ప్రకటించడం గమనార్హం. వీసా ఉన్న డ్రైవర్, ఇతర సిబ్బందిని పంపి రైలును తిరిగి ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా పాక్ తెలిపింది. 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్ప్రెస్ బుధ, ఆదివారాల్లో ఢిల్లీ, అటారీ , పాకిస్తాన్ లోని లాహోర్ స్టేషన్ల మధ్య నడుస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos