అహ్మదాబాద్ : విధానసభ సభ్యుడిగా గుజరాత్ మంత్రి భూపేంద్రసింగ్ చుడాసమా ఎన్నిక చెల్లదని గుజరాత్ ఉన్నత న్యాయ స్థానం మంగళవారం తేల్చి చెప్పింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడినందున ఆయన ఎన్నిక చెల్లదని పేర్కొంది. 429 తపాలా బ్యాలెట్ ఓట్లను అక్రమంగా రద్దు చేశారని ఆయన ప్రత్యర్ధి అశ్విన్ రాథోడ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి పరేష్ ఉపాథ్యాయ్ విచారణ జరిపి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అహ్మదాబాద్ జిల్లాలోని డోక్లా నియోజకవర్గం నుంచి భూపేందర్ సింగ్ చుడాసమ 327 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు.