భయ పడిన వారిదే మనుగడ

భయ పడిన వారిదే  మనుగడ

ముంబై : ప్రస్తుత పరిస్థితుల్లో భయపడిన వారే మనుగడ సాగిస్తారని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హితవు పలికారు. లాక్డౌన్ అనుభవాలను వివరించి సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసారు. తన అన్న సొహైల్ ఖాన్ కొడుకు నిర్వాన్తో ఇందులో మాట్లాడారు. ‘కొన్ని రోజుల కిందట ఇక్కడికి వచ్చిన మేమిద్దరం ఇక్కడే ఇరుక్కుపోయాం’ అని చెప్పారు. ‘మీ నాన్నను చూసి ఎన్ని రోజులు అవుతుంది?’ అని నిర్వాన్ను సల్మాన్ ప్రశ్నించగా అతను మూడు వారాలు అవుతోంది అని సమాధానం ఇచ్చాడు. ‘నేను కూడా మా నాన్నను చూసి మూడు వారాలైంది. మేం ఇక్కడి ఉంటే ఇంట్లో ఆయన ఒంటరిగా ఉన్నారు’ అని సల్మాన్ పేర్కొన్నారు. నిర్వాన్తో మాట్లాడుతూ ‘జో డర్ గయా వో మర్ గయా (భయపడే వాళ్లే మరణిస్తారు) అనే డైలాగ్ గుర్తుందా. కానీ, ఇప్పుడున్న పరిస్థితులకు ఈ డైలాగ్ వర్తించదు. మేం భయపడ్డాం దాన్ని ధైర్యంగా అంగీకరిస్తాం. దయచేసి ఈ పరిస్థితుల్లో మీరు కూడా ధైర్యంగా ఉండకండి’ అని సల్మాన్ సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos