సాక్షి పత్రికలో తప్పుగా రాశారు..వైఎస్ జగన్..

సాక్షి పత్రికలో తప్పుగా రాశారు..వైఎస్ జగన్..

సన్న బియ్యంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగింది.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెదేపా ఆరోపించగా అందుకు వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఇదే విషయమై అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. తమ మేనిఫెస్టోలో సన్న బియ్యం ప్రస్తావనే లేదని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. నాణ్యమైన బియ్యం ఇస్తామనే తాము చెప్పామని అన్నారు. అంశంపై సాక్షి పత్రికలో తప్పుగా రాశారనినాణ్యమైన బియ్యం, సన్న బియ్యానికి తేడా తెలియకుండా రాశారని చెప్పారు.అదే రోజు ఇతర పేపర్లలో వచ్చిన వార్తను కూడా చూడాలని అన్నారు. మీ మాదిరే వాళ్లు కూడా నాణ్యమైన బియ్యం, సన్న బియ్యానికి తేడా తెలియక కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పారు. స్వర్ణ బియ్యాన్నే సన్న బియ్యం అంటారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తుంటేఓర్చకోలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము ఇస్తున్న బియ్యంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos