భాజపాతో వైకాపా దోస్తీ

భాజపాతో వైకాపా దోస్తీ

నెల్లూరు: భాజపాతో వైకాపా లోపాయికారీ రాజకీయాన్ని సాగిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి శైలజానాథ్ ఆరోపించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి జగన్ నలభై ఐదు నిమిషాల పాటు ప్రధాని మోదీతో మాట్లాడానని అంటున్నారు. దాని వల్ల రాష్ట సమస్యలకు ఏమైనా పరిష్కారం దొరికిందా’ని ప్రశ్నించారు. ద్వంద విధానాలతో భాజపాను సంతృప్తి పర్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలో మౌనంగా ఉండే పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగాన్ని ధిక్కరించేలా పాలకుల అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. సమాఖ్య స్పూర్తిని భాజపా దెబ్బ తీస్తోందని దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో భారత అర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos