హెరిటేజ్ కోసం విజయ్ బలి

హెరిటేజ్ కోసం విజయ్ బలి

అమరావతి: హెరిటేజ్ కోసం చంద్రబాబు నాయుడు విజయ్ (ఏపీ డెయిరీ)ని నాశనం చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి శుక్ర వారం ట్విట్టర్లో ధ్వజ మెత్తారు. ‘ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవటాన్ని చంద్ర బాబు కక్కలేక, మింగలేక తంటాలు పడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థ లను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకున్న బతుకు చంద్రబాబుది. హెరిటేజ్ కోసం చంద్ర బాబు నాయుడు ఏపీ డెయిరీని నాశనం చేశారు. చంద్ర బాబు 40 సంవత్సరాల పాటు తన కుటుంబం, సొంత మనుషుల కోసమే ఆరాట పడ్డార’ని దుయ్య బట్టారు. ఈ ట్వీట్ కు విజయ సాయిరెడ్డి చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos