మెహుల్ ఛోక్సీని భారత్ పంపిస్తాం

మెహుల్ ఛోక్సీని  భారత్ పంపిస్తాం

సెయింట్ జాన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,500 కోట్ల మేరకు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ నిజాయతీ లేని వ్యక్తి కావటంతో అతన్ని భారత్ కు తిప్పి పంపిస్తామని ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనీ తెలిపారు. భారత్ లో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కేసుల న్నిం టినీ ఆయన ఎదుర్కోవాల్సిందేన న్నారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని న్యూయార్క్ లో ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. ‘మెహుల్ ఛోక్సీ ఆర్థిక నేరగాడనే సమాచారం అందింది. ఇలాంటి వ్యక్తి వల్ల తమ దేశ ప్రతిష్ట ఏ మాత్రం పెరగదు. చోక్సీ అంగీకరిస్తే భారత అధికారులు ఇక్కడకు వచ్చి ఆయనను విచారించవచ్చు. ఇందులో తమ ప్రభుత్వం చేసేదేమీ లేదు. ఏదేమైనప్పటికీ… భారత అధికారులు అందించిన సమాచా రం మేరకే చోక్సీకి తమ అధికారులు పౌరసత్వాన్ని ఇచ్చారు. దీనికి భారత అధికారులే బాధ్యత వహించాల’న్నారు. ప్రస్తుతం చోక్సి కరీబియన్ దీవు ల్లోని ఆంటిగ్వాలో తలదాచుకున్న సంగతి తెలిసిందే. 2018 జనవరిలో ఛోక్సీకి అక్కడి పౌరసత్వం లభించింది.

తాజా సమాచారం