కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో స్పెయిన్కు చెందిన కరోలినా మారీన్ చేతిలో 16-21, 13-21తో సైనా ఓటమిపాలైంది. 40 నిమిషాల పాటు సాగిన ఈ గేమ్లో ప్రపంచ ఛాంపియన్ కరోలినా మారీన్ ఆధిపత్యాన్ని సైనా ఎదుర్కోలేకపోయింది. తొలి గేమ్లో ఒక దశలో 9-9తో మారీన్తో సమంగా ఉన్న సైనా.. ఆ తర్వాత తేలిపోయింది. 16-21తో సైనా తొలి గేమ్ను కోల్పోయింది. రెండో గేమ్లోనూ మారీన్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడంతో సైనాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్కు ముందు కరోలినా మారీన్తో సైనా 10 సార్లు తలపడగా.. చెరో ఐదుసార్లు విజయం సాధించారు. తాజాగా మారీన్ ఆ సంఖ్యను ఆరుకు పెంచుకుంది.