టాలీవుడ్‌లో మాయమై శాండల్‌ఉడ్‌లో తేలాడు..

  • In Film
  • October 13, 2019
  • 137 Views
టాలీవుడ్‌లో మాయమై శాండల్‌ఉడ్‌లో తేలాడు..

ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథా రచయితగా పని చేసిన వక్కంతం వంశీ ఆ అనుభవంతో గత ఏడాది అల్లు అర్జున్ హీరోగా నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని తెరకెక్కించాడు.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించినా మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో భారీ డిజాస్టర్‌గా మిగిలింది.ఈ చిత్రం కొట్టిన దెబ్బతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మాయమైన వక్కంతం వంశీ కన్నడ చిత్ర పరిశ్రమలో తేలినట్లు సమాచారం.కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రహీరోల్లో ఒకరైడన దర్శన్‌తో వక్కంతం వంశీ త్వరలోనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.వంశీ ప్రతిభ గురించి తెలిసిన కన్నడ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నిర్మాత దర్శన్‌తో ప్రాజెక్ట్ ని సెట్ చేయించాడట.త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలిపించినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని త్వరలోనే వక్కంతం వంశీ న్యూ ప్రాజెక్ట్ పై ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos