సాహో సినిమా నుంచి సంగీత దర్శకుల నిష్క్రమణ

  • In Film
  • May 27, 2019
  • 149 Views
సాహో సినిమా నుంచి సంగీత దర్శకుల నిష్క్రమణ

హైదరాబాద్‌ : అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సాహో సినిమా నుంచి సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ వైదొలిగారు. ఈ విషయాన్ని వీరి బృందమే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. సాహోకు సంగీతాన్ని సమకూర్చడం నుంచి శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ తప్పుకున్నారని అభిమానులకు తెలియజేస్తున్నాం. ప్రభాస్‌, సుజీత్‌, వంశీ, ప్రమోద్‌, శ్యాంలకు గుడ్‌లక్‌ అంటూ ట్వీట్‌ చేసింది. దీనికి కారణమేమిటో వారు వెల్లడించలేదు. వీరి స్థానంలో తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్‌ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos