కియోవ్: ఉక్రెయిన్ నగరాల్లో మంగళవారం ఉదయం నుంచి ఎయిర్ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి. పశ్చిమ నగరాలైన టెర్రోపిల్, రివ్నే తదితర ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయని స్థానికులు తెలిపారు. కీవ్- ఖార్కివ్ మధ్య ఉన్న ఒఖ్తిర్కా మిలిటరీ బేస్పై రష్యన్ బలగాలు జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సైనికాధికారి వెల్లడించారు. సంబంధిత చిత్రాలను షేర్ చేశారు. రెండు దేశాల బలగాల మధ్య ఆదివారం జరిగిన పోరులో ఎంతో మంది రష్యన్ సైనికులు సహా స్థానికులు కూడా మృతి చెందినట్లు వివరించారు.