డిసెంబరు నుంచి ఆర్టీజీఎస్ సేవలు నిరంతరం

  • In Money
  • October 9, 2020
  • 131 Views
డిసెంబరు నుంచి ఆర్టీజీఎస్ సేవలు నిరంతరం

ముంబై : బ్యాంకు ఖాతాదారులకు ఊరటగా నగదు బదిలీ సౌకర్యం రియల్టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) ఇక వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ నుంచి ఈ సదుపాయం అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంకు వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలలో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం మినహా మిగిలిన అన్ని పని దినాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నగదు బదిలీలు అందుబాటులో ఉన్నాయి. 2019 డిసెంబర్ నుంచి నెఫ్ట్ సదుపాయాన్ని ఆర్‌బీఐ నిరంతరం అందుబాటులోకి తీసుకువచ్చిన క్రమంలో తాజా ప్రకటన వెలువడింది. నెఫ్ట్ వ్యవస్థను గత ఏడాది డిసెంబర్ నుంచి 24×7 అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుంచి సాఫీగా సాగుతోందని, ఇక పెద్ద మొత్తాల బదిలీకి ఉద్దేశించిన ఆర్టీజీఎస్ సిస్టం సైతం ఇప్పుడు కస్టమర్లకు వారంలో అన్ని రోజులూ, 24 గంటల పాటు ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది. ఆర్టీజీఎస్ కింద రూ 2 లక్షల నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు బదలాయించవచ్చు. ఆర్టీజీఎస్ ద్వారా పంపే నగదుపై గరిష్ట పరిమతి లేకున్నా పలు బ్యాంకులు రూ 10 లక్షలను గరిష్ట మొత్తంగా పరిమితి విధించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos