అమరావతి : రాష్ట్ర రహదారి రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని సోమవారం ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సోమవారం ఉదయం మొదలైన సమావేశం దాదాపు అయిదున్నర గంటల పాటు సాగింది. సామాజిక పెన్షన్లు రూ.2,250 కి పెంపు, ఆశా కార్యకర్తల వేతనాల్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపునకు, ప్రభుత్వ ఉద్యోగుల తాత్కాలిక భృతి చెల్లించాలని తీర్మానించింది. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా అమలుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికార్లను ఆదేశించారు.