ఏలూరు: సిఐటియు-ఎఐఆర్టిడబ్ల్యుఎఫ్-డబ్ల్యుఎఫ్టియు అనుబంధంతో ఎపిఎస్ఆర్టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ఏలూరు ఆర్టిసి డిపో వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆర్టిసి లో సిబ్బంది కుదింపు చర్యలు ఆపాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్టిసి మేనేజింగః డైరెక్టర్కు గురువారం సమ్మె నోటీసు ఇవ్వటం తెలిసిందే.