రేపటి నుంచి బస్సుల సంచారం

రేపటి నుంచి  బస్సుల సంచారం

అమరావతి : రాష్ట్రంలో గురు వారం నుంచి బస్సులు సంచిరించనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి వీటి సేవలు ప్రారంభంకానుందని రాష్ట్ర రహదారి రవాణా సంస్థ బుధవారం ఇక్కడి ప్రకటించింది. మార్చి 23- లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రజా రవాణా నిలిచిపోయింది. 58 రోజుల పాటు డిపోల్లో నిలిచి పోయిన బస్సులు రేపటి నుండి రోడ్లపైకి రానున్నాయి. ప్రస్తుతం 1500 బస్సులు నడపనున్నారు. ఆన్లైన్లో మాత్రమే రిజర్వ్ చేసుకోవాలి. ఇప్పట్లో అంతర్రాష్ట్ర సర్వీసులు ఉండవని తెలిపింది. ప్రయాణ సమయంలో మాస్కులు ధరించడం తప్పనిసరని సూచించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos