కొత్త ప్రతి పాదన లేదు

కొత్త ప్రతి పాదన లేదు

న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో అధికార పంపిణీ విషయంలో శివసేన మరోసారి తన వైఖరిని కుండబద్ధలు కొట్టింది. తమ నుంచి ఎలాంటి కొత్త ప్రతి పాదన లేదని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ బుధవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు.శాసనసభ ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం పైనే చర్చలు ఉంటాయని వివరించారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి పదవి విషయంలో భాజపతో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆ తర్వాతే తాము ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీకి దిగామని పేర్కొన్నారు. రెండు పక్షాల మధ్య తలెత్తిన ప్రతి ష్టంభనను తొలగించేందుకు సంఘపరివార్ మధ్యవర్తిత్వం వహించనున్నట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos