నాసిక్: ఇన్ఫోసిస్ రూపొందించిన ఐటీ, జీఎస్టీ పోర్టల్స్లో తలెత్తిన సాంకేతిక లోపాలపై పాంచజన్య చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ నాయకులు కొంత మేరకు వెనక్కి తగ్గారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచారకర్త సునీల్ అంబేకర్ దీనిపై స్పందించారు. ‘పాంచజన్య అనేది ఆర్ఎస్ఎస్ ప్రతినిధి కాదు. ఇందులో రచయిత తన భావాన్ని వ్యక్తపరచారు. అది ఆయన వ్యక్తి గతం. దీనిని సంస్థతో ముడిపెట్టకూడద’ని ట్వీట్ చేశారు.ఇన్ఫోసిస్ విదేశీ శక్తులతో జట్టు కట్టిందని అందుకే.. ఐటీ పోర్టల్లో సమస్యలు తరుచూ వెలుగు చూస్తున్నట్లు పాంచజన్యలో ఓ కథనం ప్రచురించింది.