సుబ్బిరామిరెడ్డి బంధువు ఇంట్లో భారీ చోరీ..

సుబ్బిరామిరెడ్డి బంధువు ఇంట్లో భారీ చోరీ..

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి బంధువుల ఇంట్లో భారీ చోరీ జరిగింది.హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉంటున్న సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే ఆభరణాలు చోరీకి గురయ్యాయి.సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని గుర్తించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ.2 కోట్ల విలువ చేసే వజ్రాలు,రూ.1 కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.ఉత్తమ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి వాచ్మెన్ తో పాటు చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. తెలిసినవారే చోరీకి పాల్పడి ఉంటారని  పోలీసులు అనుమానిస్తున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos