షాంపేన్ పోస్తే తాగాను… ఏముందిరా ఆ ఫొటోలో..?

షాంపేన్ పోస్తే తాగాను… ఏముందిరా ఆ ఫొటోలో..?

అమరావతి: ‘..ఆమె దూరంగా ఉండి షాంపేన్ పోసింది. నేను కొంచెం షాంపేన్ తాగితే మీకేంట్రా సంతోషం వెర్రి వెధవల్లారా … ఏముందిరా ఆ ఫొటోలో?’అని లోక్సభ సభ్యుడు రఘు రామకృష్ణ రాజు సోమవారం తన ప్రత్యర్థులపైనా, ట్రోలింగ్ కు పాల్పడుతున్న వారి పైనా ఆగ్రహించారు. ఫొటోను రఘు రామ కృష్ణ రాజు స్వయంగా విలేఖరులకు చూపించారు.‘ ఈ ఫొటో కోల్ కతాలో కానీ, హైదరాబాద్ లో కానీ తీసినది అయ్యుం టుంది. ఒక తెలుగు పార్లీమెంటు సభ్యుడి కార్యక్రమంలోనిది అనుకుంటా. దీన్ని నేనూఎప్పుడూ చూసుకోలేదు. బహుశా పెద్దలు సుబ్బారెడ్డి గారు అందించారనుకుంటున్నాను, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫొటోలో చూస్తున్నట్టుగా నేను ఎవరినీ ముట్టుకోలేదు. క్రికెట్ పోటీల్లో విజేతలకు షాంపేన్ అందించడం తెలిసిందే. గెలిచినవాళ్లు కొంచెం నోట్లో పోసుకుంటారు. నేను తాగింది కూడా షాంపేనే. అది పెద్దగా మద్యం కేటగిరీలోకి కూడా రాదు. ఇక, ఈ రోజుల్లో ఫంక్షన్లంటే రష్యన్ యువతులు సర్వ సాధారణం అయిపోయారు. ఆ యువతులు అందరి నోళ్లలోనూ పోస్తూ నా నోట్లోనూ షాంపేన్ పోశారు. ఆ సందర్భంగా నేను ఎవరినీ తాకలేదు… ఆమె దూరంగా ఉండి షాంపేన్ పోసింది. అయినా, నేను కొంచెం షాంపేన్ తాగితే మీకేంట్రా సంతోషం వెర్రివెధవల్లారా … ఏముందిరా ఆ ఫొటోలో?” అంటూ ఆవేశంగా అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos